- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు తిప్రిక రాజ్ గగన్ కి దళిత రత్న అవార్డు దక్కింది.మహనీయుల జయంతి సందర్భంగా ప్రభుత్వం దళిత నాయకులను వివిధ సేవా మార్గాలు గుర్తించి జాతికై సామాజిక సేవ పీడిత కులాల దళిత జాతి పక్షాన పోరాటం చేస్తున్న వారిని గుర్తిస్తూ శనివారం సికింద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు తిప్రిక రాజ్ గగన్ కి మహనీయుల ఉత్సవాల జయంతి కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ, దళితరత్న అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మాదిగ దండోరా నాయకులు మల్లని శివ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -