Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ కు వీడ్కోలు పలికిన టీఎన్జీవోఎస్..

కలెక్టర్ కు వీడ్కోలు పలికిన టీఎన్జీవోఎస్..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశ మందిరం నందు ఏర్పాటుచేసిన బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ వీడ్కోలు కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ ఉద్యోగులు పాల్గొని వేడుకలు తెలిపారు. అదేవిధంగా నూతన జిల్లా కలెక్టర్ గ బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ హలో కృష్ణారెడ్డికి స్వాగత సుమాంజలి పలికారు. టీఎన్జీవోస్ పక్షాన హాజరై, సమావేశాన్ని ఉద్దేశించి ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 2023 ఫిబ్రవరి న బదిలీపై వచ్చి అధికార, ఉద్యోగులతో మమేకమై, అధికార యంత్రాంగాన్ని సమన్వపరుచుకొని, జిల్లా ప్రజలందరికి సంక్షేమ పథకాలు అతి చేరువయ్య విధంగా,పాలను కొనసాగించి, పలు రాష్ట్ర, జాతీయ అవార్డులు, జిల్లాకు వరించుటకు కృషి చేసిన జిల్లా పాలనాధికారీ రాజీవ్ గాంధీ హనుమంతు కి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు. వారు జిల్లాలో ఉన్నటువంటి 21/2 సం. కాలంలో అధికారుల, ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జిల్లా ప్రజలకు అత్యున్నత సేవలందించినందుకు గాను ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వీడ్కోలు పలికి నూతనంగా జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డి ని, ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన సాదరంగా ఆహ్వానిస్తున్నామనిజిల్లా యంత్రాంగానికి అధికార , ఉద్యోగ బృందం సంపూర్ణ మద్దతుతో విధి నిర్వహణలో విధులు నిర్వహించి, జిల్లా ఖ్యాతిని పెంపొందించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం టీఎన్జీవోస్ పక్షాన  రాజీవ్ గాంధీ హనుమంతు ని శాలువాతో ఘనంగా సన్మానించి, బొకే అందజేసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, జిల్లా అధ్యక్షులు  నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవోఎస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాణిక్యం, ప్రకాష్, మంజుల సంయుక్త కార్యదర్శులు జాఫర్ హుస్సేన్, పద్మ, ఇందిర, కోశాధికారి దినేష్ బాబు, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి ,ఆర్మూర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శశికాంత్ రెడ్డి, విశాల్ భీమ్గల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, ఎస్సారెస్పీ యూనిట్ అధ్యక్షులు ప్రవీణ్ రాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి, మంగమ్మ, శ్రీవేణి, పారిజాతం, గీతారెడ్డి, సునీల్,స్వామి, సలహాదారులు వనమాల సుధాకర్ అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ కి ఘనంగా వీడ్కోలు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -