నవతెలంగాణ – కామారెడ్డి
టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయం కామారెడ్డి లో జిల్లా ఖజానా శాఖ, ఉద్యానవణ శాఖ ల ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమము టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా శాఖ, జిల్లా ఉద్యానవన శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు టీఎన్జీవోస్ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందనీ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి తెలిపారు. 80 సంవత్సరాల చరిత్ర కలిగి ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఎన్జీఓస్ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము అని సభ్యత్వం తీసుకున్న ఉద్యోగులు తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, జిల్లా కోశాధికారి ఎమ్. దేవరాజు జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్, రాజ్యలక్ష్మి జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ రాజ్ కుమార్, అర్బన్ తాలూకా ఉపాధ్యక్షురాలు స్వప్మ, ఈసి మెంబెర్ అనుదీప్ రెడ్డి, జిల్లా ఖజానా శాఖ, జిల్లా ఉద్యానవన శాఖ ల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఖజానా, ఉద్యానవణ శాఖ ఫోరంలో టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



