- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. సోమవారం బోనాల ఉత్సవంలో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగం కార్యక్రమం జరగనుంది. ఇందులో మాతంగి స్వర్ణలత అమ్మవారి తీరుగా భవిష్యవాణి చెబుతారు. భక్తులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రంగం ద్వారా అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. కాగా, ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల తరువాత నిర్వహించే అవకాశముంది.
- Advertisement -