Saturday, February 21, 2026
E-PAPER
Homeజాతీయంఏఐ సదస్సులో అమెరికా డీల్‌కు వ్యతిరేకంగా అర్థనగ్న‌ ప్రదర్శన

ఏఐ సదస్సులో అమెరికా డీల్‌కు వ్యతిరేకంగా అర్థనగ్న‌ ప్రదర్శన

- Advertisement -

చొక్కాలు విప్పి యూత్‌ కాంగ్రెస్‌ నేతల నిరసన
న్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్‌ కాంగ్రెస్‌ నేతలు గందరగోళం సృష్టించారు. శుక్రవారం సదస్సులోని ఒక వేదిక వద్దకు చేరుకున్న యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా అందరూ తమ చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. నిర్భయంగా తమ కార్యకర్తలు నిరసన తెలిపారని, ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రధాని మోడీ దేశం విషయంలో కాంప్రమైజ్‌ అయ్యారని కాంగ్రెస్‌ ఆరోపించింది.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే అంతర్జాతీయ సదస్సులో కాంగ్రెస్‌ నేతలు ఇలా ప్రవర్తించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వేదిక వద్ద ఆందోళన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ ఘటనపై బిజెపి కాంగ్రెస్‌పై మండిపడింది. ఏఐ సదస్సు విజయవంతం కావడంతో, దీన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్‌ నేతలు అసూయతో ఇలా ఆందోళన చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది. వీళ్లు ఐఎన్‌సీ కాదని.. ఏఎన్‌సీ (యాంటీ నేషనల్‌ కాంగ్రెస్‌) అని బీజేపీ వర్ణించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -