- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్ పరామర్శించారు. బుధవారం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మెన్ బెల్లయ్యనాయక్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, గజ్జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



