నవతెలంగాణ – కామారెడ్డి : టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామాకం అయిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డినీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, కామారెడ్డి నియోజకవర్గ మండల అధ్యక్షులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చిన ఏఐసీసీ నాయకులకు, పిసిసి నాయకులకు ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల గెలుపు కోసం కష్టపడతానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, కాంగ్రెస్ పార్టీ మాచారెడ్డి మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్, కామారెడ్డి మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, బీబీపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, అనంత రెడ్డి, యాదవ రెడ్డి , రెడ్డి పేట నర్సా గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, ఐరేని సందీప్, రాజా గౌడ్, అబ్రబోయినా స్వామి, తిరుమల గౌడ్, లక్కపతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.