నవతెలంగాణ – కామారెడ్డి : ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకం ఆయిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించారు. తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్బంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సీఎం కోరినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెల్సుకున్నారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES