No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్మంత్రి సీతక్కను కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి 

మంత్రి సీతక్కను కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకం ఆయిన కామారెడ్డి వాసి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రికి పుష్పగుచ్చం అందించారు. తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సీతక్క కోరినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీతక్క అడిగి తెల్సుకున్నారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా, మంత్రివర్యులు సీతక్క సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్, గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు, పంపరి లతా శ్రీనివాస్,పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, పిడుగు మమతా సాయిబాబా, సలీం, జూలూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad