- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ బదిలీ అయ్యారు. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా నిజామాబాద్ ట్రాఫిక్ విభాగం నూతన ఏసీపీగా సీటీసీలో ఉన్న మస్తాన్ అలీకి లుక్ ఆఫ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఏసీసీ నారాయణ బదిలీ అంశం నిజామాబాద్ కమిషనరేట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో పాటు ట్రాఫిక్ విభాగంలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ సైతం ఏసీపీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో ఏసీపీ నారాయణను డీజీపీ కార్యాలయనికి అటాచ్ చేశారు.
- Advertisement -