- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
నూతనంగా ఎన్నికైన అన్ని గ్రామాల సర్పంచులకు ఈనెల 23న నుండి 27 వరకు ఐదు రోజులు మహబూబ్ నగర్ పట్టణంలోని బండమీదిపల్లిలోనీ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాణంగాంలో సర్పంచ్లకు ట్రైనింగు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గీతాంజలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సర్పంచులకు ఈ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. అందరూ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీడీఓ గీతాంజలి కోరారు.
- Advertisement -



