నవతెలంగాణ – కంఠేశ్వర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కుష్టు వ్యాధి నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పీహెచ్సీ నోడల్ అధికారులందరికీ కుష్టు వ్యాధి గ్రస్తుల డిజిటలీకరణ నీకుష్టు పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని డిఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ, ఎయిడ్స్ అండ్ లెప్రసీ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో లిప్రసిపై అవగాహన కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ , ఆశాలు ఏఎన్ఎంలు పర్యవేక్షణ అధికారులు వారి వారి గృహ సందర్శనలో నూతనంగా కుష్టు వ్యాధిగ్రస్తులని గుర్తించి వారికి చికిత్స అందించాలని ఈ సందర్భంగా నోడల్ అధికారులకు కోరారు. అదేవిధంగా నూతనంగా గుర్తించిన కేసులన్నింటినీ నీకుష్టు 2.0 శిక్షణ ద్వారా పొందిన అవగాహనతో ప్రతి లెప్రసీ వ్యాధిగ్రస్తుల్ని డిజిటల్ ఈ కరణ చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని లెఫ్రా సొసైటీ ద్వారా జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడ శిక్షణ పొందిన వారు పీహెచ్సీ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని పిహెచ్సి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా , రాష్ట్రము దేశంలో 2027 సంవత్సరానికల్లా లెప్రసీ కేసులు నూతనంగా ఒకటి కూడా నమోదు కాకుండా కుష్టు రహిత భారత దేశంగా మార్చడమే మన అందరి లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పీహెచ్సీ నోడల్ అధికారులకు నికుస్ట్ పై శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES