ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో మహిళా శక్తి మిషన్ – 2025 ప్రణాళికలో భాగంగా, రైతు వేదిక, మాస్కుంట (భువనగిరి)లో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం ముఖ్యఅతిథిగా జిల్లా దినం కలెక్టర్ భాస్కర్ రావు హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలలో చేరకుండా మిగిలిన అర్హత కలిగిన మహిళలు, వృద్ధ మహిళలు (60 ఏళ్లు పైబడిన వారు), దివ్యాంగులు , 15–18 సంవత్సరాల వయస్సు గల యువతీ బాలికలను స్వయం సహాయక సంఘములలో చేర్చే విధానం, ప్రయోజనాలు మరియు ప్రభుత్వ పథకాల అనుసంధానం గురించి అవగాహన కల్పించారు.
ప్రభుత్వం ప్రకటించిన “ఇందిరా మహిళా శక్తి” విధానంలో భాగంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయడం ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.ముఖ్యంగా మిగిలి ఉన్న గ్రామీణ మహిళలను స్వయం సహాయక సంఘములలో చేర్చడం.60 ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలతో ప్రత్యేక స్వయం సహాయక సంఘములుగా ఏర్పాటు చేయడం,15–18 ఏళ్ల యువతీ బాలికలతో ప్రత్యేక స్వయం సహాయక సంఘములు ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి నాగిరెడ్డి పాల్గొని, మిషన్ లక్ష్యాలు, ప్రాధాన్యతను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అదనపు డి ఆర్. డి ఓ కోట జంగా రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి పల్లవి, కోశాధికారి అలివేలు, డీపియం లు, ఎపియం లు, సిసి లు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.