Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల బలోపేతానికే శిక్షణా కార్యక్రమాలు

మహిళా సంఘాల బలోపేతానికే శిక్షణా కార్యక్రమాలు

- Advertisement -

– ఐకేపీ మండల ఏపిఎం కుంట గంగాధర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న సదుద్దేశంతో గ్రామ సమాఖ్య పాలకవర్గ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని ఐకెపి మండల ఏపిఎం కుంట గంగాధర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకెపి శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి హాజరైన 29 గ్రామ సమాఖ్యల పాలకవర్గ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సామాజిక కార్యకర్తల పేరుతో సి.ఆర్.పి లను ఎంపిక చేసి వారికి హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి నాణ్యమైన శిక్షణను అందించారన్నారు. శిక్షణ పొందిన పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళా సంఘాల సీనియర్ సభ్యులు అంజలి, లత సిఆర్పి లుగా శిక్షణ ఇవ్వడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన సీనియర్ మహిళా సంఘ సభ్యులు అంజలి, లత మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ మహిళా సంఘాల్లో చేరాలని, ఆర్థిక స్వయం సాధికారత సాధించేందుకు మహిళా సంఘాలను వినియోగించుకోవాలని సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, కుటుంబం యొక్క ఆదాయం పెంచుకోవాలన్నారు. అలా ప్రతి ఒక్క మహిళ పేదరికంలోంచి బయటకు వచ్చి సాధికారత దిశగా పయనించాలని సూచించారు. ఈ దిశగా గ్రామ సమాఖ్య పాలకవర్గ బాధ్యులు కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో సీసీలు రవికుమార్, శ్రీనివాస్, నవీన్, భాగ్యలక్ష్మి, పీరియ, అలేఖ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు కమల, కార్యదర్శి వాసవి, కోశాధికారి రోజా రాణి, సిబ్బంది ధనలక్ష్మి, అనసూయ, సత్తెమ్మ, తదితరు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -