హాలియా సీఐగా సతీష్ రెడ్డి..
నవతెలంగాణ – హాలియా: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పనిచేస్తున్న సీఐలు, ఎస్ఐలను బదిలీ చేస్తూ ఐజీ సత్యనా రాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హాలియా సీఐగా పని చేస్తున్న జనార్దన్ గౌడ్ ను ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ప్రస్తుతం హాలియా ఎస్ఐగా పనిచేస్తున్న దేవిరెడ్డి సతీశ్ రెడ్డికి సీఐగా ప్రమోషన్ కల్పించారు. తిప్పర్తిలో పనిచేస్తున్న సాయిప్రశాంత్ హాలియా ఎస్ఐగా, త్రిపురారంలో పనిచేస్తున్న ఎస్ఐ ప్రసాద్ పెద్దవూరకు బదిలీ అయ్యారు. హుజూర్ నగర్ లో పనిచేస్తున్న ముత్తయ్య నాగార్జునసాగర్ కు బదిలీ అయ్యారు. నాగార్జునసాగర్, పెద్దవూరలో పనిచేస్తున్న ఎస్ఐలు సంపత్, వీరబాబును నల్గొండ వీఆర్ కు అటాచ్ చేశారు.
పలువురు సీఐలు, ఎస్ఐల బదిలీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES