Wednesday, October 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని చెక్‌పోస్టులు ఎత్తివేయాలని రవాణా శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కడా చెక్‌పోస్టులు ఉండొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి పెరిగింది. ఈ  నేపథ్యంలో రాష్ట్రంలోని రవాణాశాఖ చెక్‌పోస్టులను రద్దు చేస్తూ జులై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నెలరోజులు ఆలస్యంగా జీఓ జారీ అయ్యింది. తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -