నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరి జిల్లా గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రయివేట్ పాఠశాలల సమస్యలపై చర్చించారు. జూలై రెండో శనివారం భువనగిరిలో నిర్వహించనున్న విద్యా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అనిల్ కుమార్ ని సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మెరుగు మధు, జిల్లా అధ్యక్షులు పాలకూర్ల వెంకటేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీరాములు, తుంగతుర్తి రంగారావు కోశాధికారి పాండు, సింగన బోయిన సత్యనారాయణ, పూర్ణచందర్, కసుల వెంకన్న కాట చిన్నప్ప, చిన్నన్ సురేష్, తోటకూర యాదయ్య పోచంపల్లి చారి లు పాల్గొన్నారు.