- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్ : గాలి దుమారంతో కూడిన వర్షం వల్ల ఎక్కడ పడితే అక్కడ చెట్లు నేలకొరిగాయి. వాటిని సంబంధిత అధికారులు, స్థానికులు తొలగించారు. మండలంలోని బోర్గం (కే) గ్రామం నుంచి కృష్ణ నగర్ మధ్య గల రోడ్డులో సుమారు నాలుగు వృక్షాలు నెల కొరిగాయి. వాటిని సంబంధిత అర్ అండ్ బి అధికారులు, స్థానికులు తొలగించలేదు. దారి వెంట వెళ్లి వాహన దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళలో వెళ్లి వాహన దారులు ఈ వృక్షాలను ఢీ కొనే అవకాశం ఉంది. దీనితో ప్రమాదం జరుగుతుందని స్థానికులు అంటున్నారు. వెంటనే వాటిని తొలగించాలని కోరుతున్నారు.
- Advertisement -