నవతెలంగాణ – అశ్వారావుపేటపట్టణంలోని సూర్య స్కూల్ కు చెందిన విద్యార్ధులు 10 వ తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్ధులను రిలయన్స్ ట్రెండ్స్ సంస్థ సిబ్బంది శుక్రవారం వారి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. సిద్దాంతపు సాత్విక్ సాయికుమార్, టి.సోమనాద్ అనే విద్యార్ధులు 600 కి గాను 572 మార్కులు సాధించి స్కూల్ టాపర్స్ గా నిలిచారు. అశ్వారావుపేట ట్రెండ్స్ బ్రాంచ్ మేనేజర్ పెద్ది రాజు ఈ విద్యార్ధులను మెడల్, ప్రశంసా పత్రములు తో సత్కరించి ట్రెండ్స్ గిఫ్ట్ కార్డును గిఫ్ట్ కూపన్ల ను అందించారు. ఉన్నత చదువులలో రాణించాలని ఆకాంక్షించారు. వివిధ పాఠశాలల్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్ధులను తమ సంస్థ ప్రశంసిస్తున్నట్లు మేనేజర్ పెద్ది రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు తల్లిదండ్రులు,ట్రెండ్స్ సిబ్బంది పాల్గొన్నారు
పదో తరగతి టాపర్స్ కి “ట్రెండ్స్” సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES