- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని స్కూల్ తాండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బందికి సర్పంచ్ సలావత్ బుచ్చిరెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి సన్మానించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత వారం రోజుల క్రితం గ్రామసభలో విద్యుత్ ఓవర్ లోడ్ తో తాండాలో విద్యుత్ సమస్య ఉందని తెలపడంతో, విద్యుత్ అధికారులకు సిబ్బంది నివేదించడంతో, నూతన డి టి ఆర్ ను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించినందుకు విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, తండావాసులు రాథోడ్ రంజిత్, గంగావత్ నరేష్, గంగావత్ కిషన్, కరోబార్ జవహర్ బాచు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



