- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) వేదికగా పలువురు నివాళులు అర్పించారు. గత ఏడాది మరణించిన ప్రపంచ సినీ ప్రముఖులను స్మరించుకుంటూ అకాడమీ ‘ఇన్ మెమోరియం’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి కోట శ్రీనివాసరావుతో పాటు ధర్మేంద్ర, సరోజాదేవీ, మనోజ్ కుమార్ పేర్లు ఉన్నాయి. ఆస్కార్ అవార్డుల వేడుకలో భారత సినీ రంగానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
- Advertisement -



