- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ గా ఇటీవల విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన మేకల రాజయ్య యాదవ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన యాదవ సోదరులకు కాటారం డివిజన్ యాదవ సంఘము ఆధ్వర్యంలో శాలువాలతో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆత్మకూరి స్వామి యాదవ్, ప్రధానకార్యదర్శి బోయిని రాజయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు కొడారి చిన్న మల్లయ్య యాదవ్, మాజీ మండల అధ్యక్షుడు యాదండ్ల రామన్న యాదవ్, మల్లారం యాదవ కమిటీ అధ్యక్షుడు శేషు యాదవ్, సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



