- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండల మునురు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మండలంలో గెలుపొందిన నూతన గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్, పోసానిపేట ఉపసర్పంచ్ గండ్ర అంజయ్య, వివిధ గ్రామాల వార్డు సభ్యులను శార్వాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో మున్నూరు కాపు మండల అధ్యక్షులు కడెం శ్రీకాంత్, ముఖ్యఅతిథి తోట భూమయ్య, జిల్లా సెక్రెటరీ అంజయ్య, కోశాధికారి కుంట అంజయ్య, పాలకవర్గ సభ్యులు కాల హనుమాన్లు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



