నవతెలంగాణ-హైదరాబాద్: ట్రేడ్ వార్తో ప్రపంచదేశాలను బెంబేలెత్తించిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్కు ఆదేశ అత్యున్నత కోర్టులో చేదు అనుభవం ఎదురైంది.ట్రంప్ టారిఫ్ల అమలుకు అమెరికన్ ట్రేడ్ కోర్టు బ్రేకులు వేసింది. టారిఫ్లు విధించే అధికారాలు ట్రంప్కు లేవని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని ఈ సందర్భంగా ట్రేడ్ కోర్టు పేర్కొంది.
ఈ ట్రేడ్ డీల్స్ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. అయితే, ట్రంప్ అడ్మిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను ట్రేడ్ కోర్టు తిరస్కరించింది.
కాగా, ఏప్రీల్ నెలలో ట్రంప్ ట్రేడ్ వార్ ప్రారంభించి..అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ చర్యలపై ఇంటబయటా సర్వత్రా విమర్శలు రాగా..తాత్కాలికంగా 90 రోజుల పాటు వాయిదా వేశారు. యూఎస్ గ్రేట్ ఎగైన్ స్లోగెన్తో ట్రంప్.. పలు దేశాలపై టారిఫ్ పేరుతో యుద్దం ప్రకటించారు. అయితే ఈ ట్రేడ్ వార్ను పలు దేశాలు ప్రతిఘటించాయి. కెనడా, చైనా దేశాలు యూఎస్ దిగుమతులపై అదే స్థాయిలో సుంకాలు విధించాయి. కెనడా ఆటో మొబైల్ రంగంపై, బీజింగ్ యూఎస్కు చెందిన అన్ని రకాల వస్తువులపై టారిఫ్లు విధించాయి. ఆ తర్వాత నాటకీయ పరిణామాలతో చైనా, అమెరికా చర్చల ద్వారా సుంకాలపై ఒప్పందానికి కుదుర్చుకన్నాయి.