- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కరూర్ తొక్కిసలాటపై విజయ్ పార్టీ టీవీకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసుల లాఠీఛార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొంది. ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. కాగా నిన్న జరిగిన ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి రూ.20 లక్షల చొప్పున టీవీకే పార్టీ, రూ.10 లక్షల చొప్పున తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
- Advertisement -