- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జంట హత్యలు కలకలం రేపాయి. జనచైతన్య ఫేస్-2 వెంచర్లోని అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఉంటున్న షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అపార్ట్మెంట్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -