- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన లలిత కవలలకు జన్మనిచ్చింది. శనివారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108లో ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో గర్బిణీకి మార్గమధ్యలోనే పురిటి నొప్పుటు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటి రమేశ్, పైలట్ మహేందర్ ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు. అనంతరం వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది రమేష్ మహేందర్ లను బాలింత లలిత భర్త మల్లేష్ ,వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -