బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ,’ఫస్ట్ టైమ్ విజయవాడ వచ్చి ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంది. చాలా హర్రర్ సినిమాలు చూస్తుంటారు. కానీ ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు ఇలాంటి హర్రర్ సినిమా రాలేదు. ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. మాకు ‘మిరారు’తో పోటీ లేదు. ముందు మేమే రిలీజ్ డేట్ ఇచ్చాం. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని హిట్ చేస్తారు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత సాహు గారపాటి నిర్మించారు. నిజమైన హంటింగ్ హౌస్లో దీన్ని షూట్ చేసాం. ఈ సినిమా షూటింగ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఆడియన్స్ ఒక బెస్ట్ హర్రర్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు’ అని తెలిపారు.
”పరదా’ ప్రమోషన్స్కి విజయవాడ వచ్చాను. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ ప్రేక్షకులు నాపై ఎంతగానో ప్రేమ చూపించారు. వారందరికీ హదయ పూర్వక కతజ్ఞతలు. నాకు చిన్నప్పటి నుంచి హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా ఒక యూనిక్ హర్రర్. డైరెక్టర్ కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. తెలుగు బెస్ట్ హర్రర్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది. మీ అందరి అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ఉంది’ అని హీరోయిన్ పరమేశ్వరన్ చెప్పారు.
ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ అదిరిపోతారు
- Advertisement -
- Advertisement -