అభినందించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన ఇద్దరినీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ఈ మేరకు ప్రమోషన్ పొందిన ఇద్దరు ఎస్సైలు బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని, ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ఏఎస్ఐ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ ఎస్ ఐ నుండి ఎస్సైగా పదోన్నతి పొందిన బి ఈశ్వర్ మూడవ పోలీస్ స్టేషన్ నుండి ఆదిలాబాద్ కు, గంగా ప్రసాద్ రెంజల్ పోలీస్ స్టేషన్ నుండి ఆదిలాబాద్ కు వెళ్తున్నట్లు తెలిపారు.
ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES