– విషాదంలో బాధిత కుటుంబం
నవతెలంగాణ- అచ్చంపేట
వ్యవసాయ పొలంలో నీటి నిల్వకు తీసుకున్న గుంతలో పడి ఇద్దరు పిల్లలు (అన్నదమ్ములు) మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మన పల్లిలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుంభం ధరణి, సుధాకర్ దంపతులకు అశ్విత్ కుమార్ (8), చేతన్ (6). తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు పత్తి విత్తనాలు విత్తే పనిలో నిమగమయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు సమీపంలోని పొలం దగ్గర ఆడుకుంటున్నారు. పని ముగించుకుని వచ్చిన తరువాత తల్లిదండ్రులు పిల్లలు కనిపించడం లేదని చుట్టూ వెతకగా నీటిగుంతలో పడివున్నారు. ఒక్కసారిగా తల్లిదండ్రులు ఆ దృశ్యం చూసి కొద్దిసేపు షాక్కు గురయ్యారు. బోరున విలపించారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
- Advertisement -
- Advertisement -