నవతెలంగాణ – కంఠేశ్వర్ : అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి శనివారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిగిత్యాల జిల్లా చిలుకల వాడకు చెందిన షేక్ యామీన్, ఆదిలాబాద్ జిల్లా తాటిగూడ రైల్వే స్టేషన్ కు చెందిన సయ్యద్ ఫరూక్ గతంలో 20కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. మహారాష్ట్రకు చెందిన సత్యతో కలిసి బాసరలో రూమ్ కిరాయికి తీసుకుని నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు చేసేవారు. ఇదే క్రమంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసిన ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు. అదే బైక్ పై తాళం వేసిన ఏదైనా ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. దొంగతనం చేసేందుకు తిరుగుతున్న క్రమంలో పోలీసులు పట్టుకుని విచారించగా నలుగురు ముఠాగా ఏర్పడి ఎడపల్లి పీఎస్ పరిధిలోని ఒక ఇంట్లో, ఒక షాప్ లో తాళాలు పగుల కొట్టి దొంగతనం చేశారు. అదేవిధంగా నగరంలోని మూడో టౌన్ ఏరియాలో ఒక తాళం వేసి ఉన్న ఇంట్లో విలువైన వస్తువులు ఎత్తుకుని పోయారు. జక్రాన్ పల్లిలోని ఒక బెల్ట్ షాపులో కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. అదేవిధంగా ట్రైన్ లలో తిరుగుతూ మొబైల్ ఫోన్లు దొంగతనాలు చేస్తున్న మేడ్చల్ జిల్లా దూపలల్లి, కోంపల్లికి చెందిన హన్మోహర్ అరవింద్ తో కలిసి డబ్బులు పంచుకునేవారు. నిందితుల నుంచి రూ.5వేల నగదు, 5సెల్ ఫోన్లు, ఒక టీవీ, రెండు ద్విచక్ర వాహనాలు, దొంగతనం చేసేందుకు ఉపయోగించే పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
దొంగల ముఠాకు చెందిన ఇద్దరి అరెస్ట్ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES