71,417 మంది విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది
ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు రెండుశాతం కరువు భత్యం (డీఏ) పెంచుతున్నట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీనివల్ల విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71.417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది కలుగుతుందని చెప్పారు. పెరిగిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. శనివారంనా డిక్కడి ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగ, ఇంజినీర్ సంఘాల సమక్షంలో డీఏ పెంపుపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన కార్యక్రమంలో గతంలో 14.074 శాతంగా
ఉన్న డిఏను 16.018 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనివల్ల విద్యుత్ సంస్థలపై ప్రతి నెల రూ.11,193 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు తగినట్టు విద్యుత్ ఉద్యోగులు వారికి సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో టీజీ ట్రాన్స్కో సీఎమ్డీ కృష్ణభాస్కర్, పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు రత్నాకర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శివాజీ, 1104 యూనియన్ నేత సాయిబాబా, 327 యూనియన్ నాయకులు ఎన్ శ్రీధర్, పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు బేసిరెడ్డి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు శ్యామ్ మనోహర్, 1535 యూనియన్ నాయకులు వజీర్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ, టీఆర్వీకేఎస్ యూనియన్ నాయకులు కరెంటురావు తదితరులు పాల్గొన్నారు.
రెండు శాతం డీఏ పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES