Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకడుపు నొప్పి భరించలేకబీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

కడుపు నొప్పి భరించలేకబీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-ఆదిబట్ల
కడుపు నొప్పి భరించలేక బీటెక్‌ విద్యార్ధి మైత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. స్థానికులు, ఆదిభట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడుసు వెంకటేష్‌, పారిజాతల చిన్న కూతురు గడుసు మైత్రి(19) ఇబ్రహీంపట్నం గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. రెండు రోజులుగా కడుపు నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమె తల్లిదండ్రులు స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అది తగ్గకపోవడంతో బుధవారం ఉదయం చెవి పోటు రావడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా తగ్గకపోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బుధవారం మధ్యాహ్నం తన రూమ్‌లో చీరతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -