- Advertisement -
– 108,102 సిబ్బంది పనితనం పై ఆరా
– ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వైద్యారోగ్య అత్యవసర సేవలు పై ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్ గురువారం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 102,108 నిర్వహణ,రోగులకు అందించే సేవలు పై ఆరా తీసారు. మండలంలో 102 సేవలు ఎలా ఉన్నాయి? గర్భిణీ లను సకాలంలో సురక్షితంగా ఆసుపత్రికి తరిలిస్తున్నారా?వాహనం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.వాహనాల కండిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ ఎక్జిక్యూటివ్ జిల్లా ఇంచార్జి మనోహర్,ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సుహాసిని పాల్గొన్నారు.108,102 పైలెట్ లు రామక్రిష్ణ,కొప్పుల ధర్మరాజు లు ను అభినందించారు.
- Advertisement -



