- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మాజీ కేంద్ర మంత్రి,స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) 96వ జయంతి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బండి రణదీర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో కాకా జయంతి వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి,అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాకా అభిమానులు పాల్గొన్నారు.
- Advertisement -