- Advertisement -
నవతెలంగాణ – సిద్దిపేట
అత్య పత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాయ్స్ , గర్ల్స్ జిల్లాస్థాయి సెలక్షన్స్ కొండపాక హై స్కూల్ లో నిర్వహించడం జరిగిందని అత్య పత్య అసోసియేషన్ సెక్రటరీ బుస మహేష్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ సెలక్షన్ లో వివిధ పాఠశాలల నుండి 100 మంది క్రీడాకారులు రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్మెన్ జంగిటి శ్రీనివాస్, అధ్యక్షులు ఇప్ప నర్సింహా నాయుడు, పనాల వెంకటరెడ్డి , కోశాధికారి షాదుల్ల, జాయిన్ సెక్రటరీ బి వెంకటేష్, రాజు, ఉప్పలయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -