Friday, June 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆగని భూ పోరు.. జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

ఆగని భూ పోరు.. జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

- Advertisement -


ప్రభుత్వాలు ఏవైనా రైతులే సమిదలు
ఓవైపు గ్రీన్ ఫీల్డ్ కోసం భూసేకరణ
భూములు ఇచ్చేందుకు రైతుల ససేమిర 
తాజాగా రావిర్యాల భూములపై ప్రభుత్వం కన్ను
భూముల స్వాధీనానికి ప్రభుత్వం యత్నం
అడ్డుకుంటున్న అన్నదాతలు 
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం 
: రంగారెడ్డి జిల్లాలో భూ నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏదో ప్రాంతంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిరసన వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చేది లేదని రైతులను తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వ చర్యను అడ్డుకుంటున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఓవైపు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అదనంగా గ్రీన్ ఫీల్డ్ పేరుతో మరింత భూ సేకరణకు పూనుక్కుంటుందని రైతులు మండిపడుతున్నారు. ఇటీవల లగచర్ల భూ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు సమీపంలో ఉన్న భూములపై ప్రభుత్వం కన్ను పడింది. ఆ భూములను స్వాధీనానికి యత్నిస్తోంది. ఈ చర్యను రైతులు అడ్డుకుంటున్నారు. ఈ రైతుల ఆందోళనకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వం మద్దతు ప్రకట్టించింది. దాంతో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వ్యతిరేక ఉద్యమాలను బలపడుతున్నాయి. 

మహేశ్వరం మండలంలోని రావిర్యాల రెవెన్యూ పరిధిలోని 289సర్వేనెంబర్‌లోని 100 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధపడింది. గతంతో ఈ భూమిని ప్రభుత్వం హౌసింగ్‌ బోర్డుకు ఇచ్చినా నేపథ్యంలో ఆ భూమి ప్రభుత్వానికే చెందుతుందని ప్రభుత్వ వాదన. కాగా బుధవారం ఈ భూమిని ఆటు రెవెన్యూ, ఇటు పోలీసు, హౌసింగ్ బోర్డ్,  టీఎస్‌ఐఐసీ అధికారులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు పూనుకున్నారు. ఈ చర్యను రైతులు అడ్డుకున్నారు. 

భూ సేకరణను అడ్డుకున్న రైతాంగం..

రావిర్యాల రెవెన్యూ పరిధిలోని 289 సర్వే నెంబర్‌లోని 100ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నందుకు బుధవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య హౌసింగ్ బోర్డు, రెవెన్యూ,  టిఎస్ఐఐసీ అధికారులు సంయుక్తంగా భూముల మీదకు వచ్చారు. సదరు భూమి టీఎస్ఐఐసీకి చెందినదిగా భావిస్తూ ఆ భూమి చుట్టూ పెన్సింగ్ వేయడానికి పూనుకున్నారు. తరాల నుండి ఆ భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రవిర్యాల రైతాంగం అడ్డుకున్నారు. తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకోవడం ఏమిటని రైతాంగ ప్రశ్నిస్తుంది. ఈ భూములనే జీవనాధారంగా చేసుకొని గడుపుతున్న తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తమ భూముల జోలికి రావద్దని అధికారులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

రైతాంగానికి సబితారెడ్డి మద్దతు..

రావిర్యాల రెవెన్యూ పరిధిలోని సుమారు 100 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న చర్యను నిరసిస్తూ రైతాంగ ఆందోళన దిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతుల ఆందోళన చేస్తున్న భూముల్లోకి చేరుకున్నారు. రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. రైతులతోనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం నుంచి బలవంతంగా భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నదని విమర్శించారు. రైతాంగానికి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

రోడ్డు మీద పడుతున్న రైతాంగం..

రావిర్యాల రెవెన్యూ పరిధిలోని 73 సర్వే నెంబర్లు 53 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన సుమారు 60 మంది రైతులు సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇదే రెవెన్యూ పరిధిలోని 289 సర్వే నెంబర్లు సుమారు 400 ఎకరాలకు పైగా భూమి కలిగి ఉంది. అయితే ఇందులో సుమారు 100 ఎకరాల భూములను గతంలో హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం కేటాయించింది. కానీ రైతాంగం 73 సర్వే నెంబర్లో కాకుండా 289 సర్వే నెంబరులో కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. అందుకే ఆ భూములు ప్రభుత్వానివని, అందుకే సదరు భూములను సాధించడం చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ రైతాంగ మాత్రం తమకు 73 సర్వే నెంబరు ఎక్కడుందో చూపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం ఇది భూమిని 73 సర్వేనెంబర్ గా గుర్తించే పట్టాలు జారీ చేసిన తర్వాత ఇప్పుడు 73 సర్వే నెంబరు భూమి కాదని చెప్పడం, 289 సర్వేనెంబర్ గా చెబుతూ భూముల స్వాధీనానికి పూనుకోవడం ఏమిటని రైతాంగం ప్రశ్నిస్తోంది. ఏదో పేరుతో తమను భూ నిర్వాసితులను చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంటుందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. తమ భూముల వద్దకు రావద్దని తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతాంగం భీష్మిస్తోంది. దాంతో జిల్లా వ్యాప్తంగా ఏదో ప్రాంతంలో భూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగితేనే ఉన్నాయి. ప్రభుత్వ చర్యన రైతంగా అడ్డుకుంటూనే ఉంది. రైతాంగ పోరాటానికి ఆయా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -