నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలులో ప్రయాణిస్తూ బురద తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడని రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..తేదీ 10.06.2025 రోజున రాత్రి 01.40 గంటలకు నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ అయిన దుర్గ ప్రసాద్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక గుర్తు తెలియని 50-55 సంIIలు గల పురుషుడు రైలు నెంబర్ 57411 గుంతకల్లు నుండి బోధన్ వెళ్ళు రైలులో ప్రయాణిస్తూ గుర్తుతెలియని ఆనారోగ్య కారణాలతో మృతిచెందినాడు. మృతుడి వద్ద గుర్థించుటకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకొని శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూం కు తరలిించారు. మృతుడిని గుర్తించినచో నిజామాబాద్ రైల్వే పోలీస్ 8712658591 నెంబరుకు సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు.
ట్రైన్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES