Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeసినిమాయూనిక్‌ పాయింట్‌

యూనిక్‌ పాయింట్‌

- Advertisement -

పవన్‌ కేసరి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా టి.డి.ఆర్‌ సినిమాస్‌ బ్యానర్‌ మీద ప్రొడక్షన్‌ నెం.1గా తలారి దినకరణ్‌ రెడ్డి నిర్మిస్తున్న నూతన చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. క ుంచం శంకర్‌ దర్శకుడు. ముహుర్తపు సన్నివేశానికి రామ్‌ అబ్బరాజు క్లాప్‌ నివ్వగా, ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మెల కెమెరా స్విచాన్‌ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. రామ్‌ అబ్బరాజు, ప్రశాంత్‌ దిమ్మెల, అడిదాల విజయ్‌పాల్‌ రెడ్డి స్క్రిప్ట్‌ అందించారు. హీరో పవన్‌ కేసరి మాట్లాడుతూ, ‘నా బాల్య స్నేహితుడు సన్నీ స్థాపించిన ఈ బ్యానర్‌ మీద సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది. కావ్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు’ అని అన్నారు.
‘దర్శక, నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విజయ్‌ మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. ఓ మంచి చిత్రాన్ని ఆడియెన్స్‌ ముందుకు తీసుకు వస్తున్నామని కచ్చితంగా చెప్పగలం’ అని హీరోయిన్‌ కావ్యా కళ్యాణ్‌ రామ్‌ చెప్పారు. డైరెక్టర్‌ కుంచం శంకర్‌ మాట్లాడుతూ, ‘మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియాకు, నాకు సహకరించి చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మా మూవీ టీంకు థ్యాంక్స్‌’ అని తెలిపారు. సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌ మాట్లాడుతూ, ‘నేను ఇంత వరకు కొత్త దర్శకులతోనే పని చేశాను. శంకర్‌ మంచి కథను రాసుకున్నారు. ఈ కథ నాకు చాలా నచ్చింది. మంచి ట్యూన్స్‌ వస్తున్నాయి. పవన్‌ పెద్ద హీరో అవుతాడని అనిపిస్తోంది. కావ్య ఈ మూవీకి పెద్ద ఎస్సెట్‌ అవుతారు. విప్లవ్‌తో ‘బేబీ’ మూవీకి పని చేశాను’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad