– డబ్ల్యూఈఎఫ్ నివేదికలో
– భారత్ మరో రెండు స్థానాలు పతనం
– మహిళా సాధికారతలో వెనుకబాటు
– పార్లమెంటులో తగ్గుతున్న ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ: ప్రపంచ లింగ అసమానతల నివేదికలో భారత్ ర్యాంక్ మరో రెండు స్థానాలు పడిపోయింది. ప్రపంచ ఆర్థిక ఫోరం రూపొందించిన ఈ నివేదిక ప్రకారం మొత్తం 148 దేశాలలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 64.1 శాతం సమానత్వ స్కోరుతో భారత్ దక్షిణాసియాలో అతి తక్కువ ర్యాంక్ పొందిన దేశాల జాబితాలో నిలిచింది. గత సంవత్సరం మన దేశం 129వ ర్యాంక్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను కొలిచే ఈ సూచికలో నాలుగు కీలక కోణాలను…ఆర్థిక అవకాశాలు, విద్య, ఆరోగ్యం-మనుగడ, రాజకీయ సాధికారతను పరిగణనలోకి తీసుకుంటారు.
ఆర్థిక పనితీరులో…
అంతర్జాతీయ లింగ అసమానతల సూచీ ప్రకారం మొత్తంగా భారత్ ఆర్థిక పనితీరు +0.3 పాయింట్లు మెరుగుపడింది. ‘ఆర్థిక వ్యవహారాలలో మహిళల భాగస్వామ్యం, అవకాశాల కోణంలో చూస్తే భారత్ పనితీరు +0.9 శాతం మెరుగుపడి 40.7 శాతానికి చేరింది. అనేక సమానత్వ విలువలు అలాగే ఉన్నప్పటికీ అంచనా వేసిన ఆదాయంలో సమానత్వ ం 28.6 శాతం నుండి 29.9 శాతానికి పెరిగింది’ అని నివేదిక తెలిపింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) గత సంవత్సరం ఉన్నట్లుగానే ఈ ఏడాది కూడా 45.9 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ భారత్ సాధించిన అత్యధిక రేటు ఇదే.
కీలక సూచికలలో…
విద్యాభ్యాసం విషయానికి వస్తే భారత్ 97.1 శాతం స్కోరు సాధించింది. అక్షరాస్యతలోనూ, మూడో స్థాయి విద్యలో ప్రవేశంలోనూ మహిళల వాటా పెరుగుతోందన్న వాస్తవాన్ని ఈ స్కోరు తెలియజేస్తోంది. ఆరోగ్యం-మనుగడ విషయంలో కూడా స్త్రీ పురుషుల మధ్య మన దేశం అధిక సమానత్వాన్నే సాధించింది. ఆడబిడ్డల జననాల రేటులోనూ, ఆరోగ్యకరమైన ఆయుద్దాయంలోనూ భారత్ మెరుగుదల కనబరచింది. మొత్తంగా స్త్రీ పురుషుల ఆయుర్దాయం తగ్గినప్పటికీ వారు ఆరోగ్య ంగానే గడుపుతున్నారని నివేదిక చెబుతోంది. ‘మహి ళా సాధికారత విషయంలో మాత్రం భారత్ స్థానం స్వల్పంగా (-0.6 పాయింట్లు) తగ్గింది. పార్లమెంటు లో మహిళల ప్రాతినిధ్యం 2025లో 14.7 శాతం నుండి 13.8 శాతానికి పడిపోయింది. ఇది వరుసగా రెండో సంవత్సరం కూడా 2023 స్థాయిల కంటే తక్కువగా ఉంది’ అని తెలిపింది. అలాగే మంత్రి పదవులు నిర్వహించిన మహిళల సంఖ్య కూడా 6.5 శాతం నుండి 5.6 శాతానికి తగ్గిపోయింది. 2019లో అత్యధికంగా 30 శాతంగా ఉన్న సూచిక స్కోరు ఈ ఏడాది 5.9 శాతానికి తగ్గింది.
మరో 123 ఏండ్ల తర్వాతే పూర్తి సమానత్వం
రాజకీయ సాధికారత, ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామ్యం విషయాలలో దక్షిణాసియాలో బంగా ్లదేశ్ గణనీయమైన ఫలితాలు సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 75 స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచింది. నేపాల్ 125, శ్రీలంక 130, భూటాన్ 119, మాల్దీవులు 138, పాకిస్తాన్ 148వ స్థానాల లో ఉన్నాయి. ప్రపంచ లింగ అసమానతలు 68.8 శాతానికి చేరుకున్నాయని, కోవిడ్-19 మహమ్మారి తర్వాత బలమైన వార్షిక మెరుగుదల కన్పిస్తోందని నివేదిక తెలియజేసింది. అయితే ప్రస్తుత రేట్ల ప్రకారం చూస్తుంటే స్త్రీ పురుషుల మధ్య పూర్తి సమానత్వం సిద్ధించడానికి మరో 123 సంవత్సరా లు పట్టవచ్చునని చెప్పింది. కాగా వరుసగా 16వ సంవత్సరం కూడా ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలవగా ఫిన్లాండ్, నార్వే, యూకే, న్యూజిలాండ్ దేశాలు తర్వాతి స్థానాలు పొందాయి. నివేదికకు సంబంధించిన 19వ ఎడిషన్ మొత్తం 148 దేశాలను గమనంలోకి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు సాధించిన విజయాలతో పాటు ఎదుర్కొంటున్న అవరోధాలను కూడా అది సవివరంగా తెలిపింది.
నాయకత్వ స్థానాలలో ప్రాతినిధ్యం తక్కువే
రాజకీయ సాధికారత, ఆర్థిక భాగస్వామ్యం విషయాలలో మహిళలు ప్రపంచవ్యాప్తంగా ముంద డుగు వేస్తున్నారు. విద్యను సముపార్జించ డం, ఆరోగ్యం-మనుగడ సాధించడం వంటి విషయాలలో సమానత్వ స్థాయి 95 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ప్రపంచ కార్మిక శక్తిలో మహిళల వాటా 41.2 శాతంగా ఉన్నప్పటికీ నాయకత్వ అసమానతలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక గుర్తించింది. ఉన్నత నాయకత్వ స్థానాలలో మహిళల వాటా కేవలం 28.8 శాతం మాత్రమేనని తెలిపింది. ప్రపంచ ఆర్థిక అస్థిరత, వృద్ధి రేటుపై నిరాశాజనక మైన సూచనలు, సాంకేతిక-భౌగోళిక మార్పులు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ లింగ సమానత్వ ంలో కన్పిస్తున్న మెరుగుదల ఆర్థిక పునరుద్ధరణకు కీలకమవుతోందని ప్రపంచ ఆర్థిక ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ సాదియా జహిది చెప్పారు. సమానత్వం దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నిర్ణయాత్మక పురోగతి సాధిస్తున్నాయన్నది సుస్పష్టమని, అవి ఆర్థికాభివృద్ధి లో తమను తాము బలంగా, మరింత ఆధునికంగా, స్థితిస్థాపకంగా నిలుపుకుంటున్నాయని ఆయన తెలిపారు.
తగ్గని లింగ అసమానతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES