- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు నేటితో ముగిశాయి. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం అడిగితే.. ఎన్నికల సంఘం మాత్రం 60రోజులు గడువు కోరింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాగా ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు రిజర్వు చేసింది.
- Advertisement -