నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని సిద్దులగుట్ట వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యానమహ శక్తి క్షేత్రం యొక్క నూతన సంవత్సర క్యాలెండర్లను శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదార నంద స్వాముల వారి చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని , ధ్యానం చేసి జ్ఞానం పొందాలని సమస్త మానవాళికి తెలియపరచడం కొరకు ఈ నూతన సంవత్సర క్యాలెండర్లను చేయించడం జరిగిందని పి ఎస్ ఎస్ ఎమ్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిఎస్ఎస్ఎమ్ కమిటీ సభ్యులు శ్రీ సుఖాల లక్ష్మణ్, సబ్బాని సుదర్శన్,గురడి దేవదాస్, వెంకట్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ క్యాలెండర్ల ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



