– మతతత్వ బీజేపీపై ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం
– ప్రజా ఉద్యమాల ద్వారానే పార్టీ బలోపేతం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ-కామేపల్లి
వెనిజులాపై అమెరికా చేపడుతున్న యుద్ధోన్మాద చర్యలు ప్రపంచశాంతికి తీవ్రమైన ముప్పుగా మారాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) వైరా డివిజన్ విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ అధ్యక్షతన కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముందుగా గ్రామంలోని మల్లెంపాటి శ్రీనివాసరావు స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వెనిజులపై అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న దాడులను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సమావేశంలో జాన్వెస్లీ మాట్లాడారు. సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మతతత్వ రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న బీజేపీపై ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మించి, లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల ఆధారంగా ఉద్యమాలు నిర్మించి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. పార్టీ పిలుపునిచ్చిన ”ఇంటింటికి సీపీఐ(ఎం)” కార్యక్రమాన్ని డివిజన్ వ్యాప్తంగా విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల మధ్యకు వెళ్లి పార్టీ విధానాలను వివరించి ప్రజా మద్దతును పెంచుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు రమణ, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, సుంకర సుధాకర్, దొంతిబోయిన నాగేశ్వరరావు, చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, మచ్చా మణి, కె.నరేంద్ర, అంబటి శ్రీనివాస్రెడ్డి, బాదవత్ శ్రీనివాస్, అష్టగుర్తి, సింగరాయపాలెం సర్పంచ్లు కంచర్ల అనిత, వేము నాగరాజు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వెనిజులాపై అమెరికా దాడులు తక్షణమే నిలిపివేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



