- Advertisement -
టర్కీ : ఇరాన్లో నిరసనలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపుల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు టర్కీ యోచిస్తోంది. శుక్రవారం అమెరికా- ఇరాన్ల మధ్య చర్చలు జరపడానికి టర్కీ ప్రయత్నిస్తోంది. ఇస్తాంబుల్లో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి హాజరవుతారని బ్లూమ్బెర్గ్ నివేదించింది. బహుశా టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ కూడా ఆజరయ్యే అవకాశం ఉంది.
- Advertisement -



