నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాలను తగ్గించే ఒప్పందాన్ని ఉల్లంఘించామని అమెరికా చేసిన వాదనలను గట్టిగా తిరస్కరిస్తున్నట్లు చైనా సోమవారం తెలిపింది. జెనీవాలో ఉన్నత అధికారుల మధ్య జరిగిన చర్చల తర్వాత బీజింగ్, వాషింగ్టన్ గత నెలలో 90 రోజుల పాటు ఒకరిపై ఒకరు విధించుకున్న అధిక సుంకాలను తగ్గించుకునేందుకు అంగీకరించాయి. కానీ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ బీజింగ్ “ఒప్పందాన్ని నెమ్మదిస్తోంది” అని మీడియాతో అన్నారు. దీనిపై చైనా స్పందిస్తూ అమెరికా వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు ఆరోపణలు చేస్తుందని సోమవారం ఎదురుదాడి చేసింది. ఈ అసమంజసమైన ఆరోపణలను తాము గట్టిగా తిరస్కరిస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చైనాపై వరుసగా అనేక వివక్షతతో కూడిన నియంత్రణ చర్యలను వాషింగ్టన్ ప్రవేశపెట్టిందని పేర్కొంది. కృత్రిమ మేధస్సు చిప్లపై ఎగుమతి నియంత్రణలు, యునైటెడ్ స్టేట్స్లో చైనీస్ విద్యార్థి వీసాలను రద్దు చేయడాన్ని ఉటంకించింది. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను నిలబెట్టుకోవడానికి దృఢ నిశ్చయంతో బలమైన చర్యలు తీసుకుంటూనే ఉంటుందని పేర్కొంది.
అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తుంది: చైనా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES