- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
పశువైద్య, పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం డిచ్పల్లి మండల పశువైద్యులు డాక్టర్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో యనంపల్లి గ్రామంలో వేశారు. ఈ సందర్భంలో అయన మాట్లాడుతూ.. తొలకరి జల్లులు కురియడం వలన వచ్చే కొత్తగడ్డి తినడం వల్ల గేదెలలో గొంతు వాపు వ్యాధి, ఆవులలో జబ్బువాపు వ్యాధి, అలాగే గొర్లలో చిటుకు రోగం వచ్చే అవకాశం ఉన్నందున, మూగ జీవాలు కలిగిన రైతులు ముందస్తుగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాధి నివారణ టీకాలు వేయించుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -