- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి పంచాయతన దేవాలయం, దత్తాత్రేయ స్వామి ఆలయయాల్లో వసంత పంచమి వేడుకల సందర్భంగా వేద త్రిపుర పీఠం సభ్యులచే ఘనంగా సర్వస్వతీ పూజలు అంగరంగవైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ చెందిన విద్యార్థిని విద్యార్థులతో సరస్వతి దేవి పూజలు నిర్వహించారు. ఈ వేడుకలు తిలకించడానికి పెద్దయెత్తున సందర్శకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



