నవతెలంగాణ – కామారెడ్డి
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వీరనారి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎల్.బి. చందర్ నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, కామారెడ్డి ఆర్డీవో వీరనారి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటానికి చిహ్నం. దళిత – బహుజన సమాజానికి ఆమె ధైర్యం ఆదర్శమన్నారు. పోరాటస్ఫూర్తి నింపిన మహనీయురాలనీ, ఆమె త్యాగం, వీరస్వభావం తరతరాలకు ఆదర్శం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ , సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు నీల నాగరాజ్, వినోద్ నాయక్, కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం, రాజయ్య , శ్రీకాంత్,నాగరాజు, రాజేశ్వర్, పవన్, అశ్వక్, సునీత, విజయ,జిల్లా అధికారులు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES