- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి : మండల పరిధిలోని బేగంపేట, లక్ష్మిపూర్, వీరాపూర్ గ్రామ ప్రజలు ప్రమాదపుటంచునా ప్రయాణం చేస్తున్నారు. గత కొద్దేండ్లుగా వీరాపూర్ గ్రామ శివారులోని వరదకాల్వ బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలమయమై వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. గుంతలమయమైన బ్రిడ్జి నుండే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి గుంతలమయమైన వరద కాల్వ బ్రిడ్డి వద్ద రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Advertisement -