నవతెలంగాణ – మల్హర్ రావు : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని కోయ్యుర్ గ్రామానికి చెందిన వేల్పుల మహేందర్ ను నియమించామని జిల్లా అధ్యక్షులు దుండ్ర కుమార్ యాదవ్ తెలిపారు.బుధవారం ఈ మేరకు నియామక పత్రం అందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర కమిటీ అదేశాల మేరకు పని చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ఆర్సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వేల్పుల మహేందర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండల కమిటీలతో పాటు గ్రామ కమిటీలను కూడా పూర్తి చేస్తామని, సమస్యల పరిష్కారంలో పేద ప్రజల పక్షాన కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకు ఈ పదవి రావడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోటగిరి సతీష్, రాష్ట్ర కమిటీ సభ్యులు దయ్యాల సదయ్య, మంత్రి రాకేష్, టి రవికుమార్, జిల్లా అధ్యక్షులు దుండ్ర కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్ హెచ్ఆర్సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేల్పుల మహేందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES